సోషల్ మీడియా లో తన కూల్ పిక్స్ ను షేర్ చేసిన చరణ్!

సోషల్ మీడియా లో తన కూల్ పిక్స్ ను షేర్ చేసిన చరణ్!

Published on Apr 26, 2022 9:09 PM IST


మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆచార్య చిత్రం థియేటర్ల లో విడుదల కి సిద్దం అవుతోంది. ఏప్రిల్ 29, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తుంది. ఇంటర్వ్యూ లతో ఇప్పటికే సినిమా పై భారీ హైప్ క్రియేట్ అవ్వగా, తాజాగా రామ్ చరణ్ పలు కూల్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆచార్య చిత్రం లో రామ్ చరణ్ సిద్దం పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో రామ్ చరణ్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ తో కలిసి చేస్తున్న చిత్రం కావడం, పవర్ ఫుల్ లుక్ తో కనిపించడం తో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ షేర్ చేసిన ఫోటోలు మరింత ఆసక్తి గా ఉన్నాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు