అడవితల్లి మాట పై రామజోగయ్య శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

అడవితల్లి మాట పై రామజోగయ్య శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

Published on Nov 30, 2021 2:55 PM IST

పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి హీరోలుగా, నిత్యా మీనన్, సంయుక్త లు హీరోయిన్స్ గా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో సితార ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం కి టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అంతేకాక ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి నాల్గవ పాట విడుదల కి సిద్దం గా ఉంది. రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. అయితే అడివితల్లి మాట అంటూ సాగే పాట పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పాట పై తాజాగా రచయిత రామ జోగయ్య శాస్త్రి గారు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి పాట మన జాబితా లో పడటానికి అదృష్టం ఉండాలి అని అన్నారు. విన్నాక మీరే అంటారు చూడండి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ పాట ఇలా ఉండాలి అని సూచించిన దార్శనికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ముందస్తు కృతజ్ఞతలు అని, రేపు మరింత గట్టిగా మాట్లాడుకుందాం అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు