ఎవరిని చూడాలో అర్ధం కావట్లేదు పో – రామజోగయ్య శాస్త్రి

ఎవరిని చూడాలో అర్ధం కావట్లేదు పో – రామజోగయ్య శాస్త్రి

Published on Apr 17, 2022 7:58 PM IST


మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం ను ఏప్రిల్ 29, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి భలే భలే బంజారా సాంగ్ ప్రోమో ను విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు. ఈ పాట ప్రోమో పై తాజాగా ఆయన స్పందించారు. ఎవరిని చూడాలో అర్ధం కావట్లేదు పో, ఇద్దరికిద్దరు సిరుత పులుల సిందాట అని అన్నారు.

కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం లో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటుగా, ఫైట్స్, ఎలివేషన్స్ భారీ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు