మనిషి జంతువులా మారితే ?.. అదే ‘యానిమల్‌’ కథ !

మనిషి జంతువులా మారితే ?.. అదే ‘యానిమల్‌’ కథ !

Published on Nov 21, 2021 11:45 PM IST

అర్జున్‌ రెడ్డి అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేసి.. అదే బోల్డ్ సినిమాని హిందీలో కూడా చేసి.. రెండు ప్రధాన భాషల్లో తనకంటూ సొంత మార్కెట్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ. కాగా సందీప్ తన కొత్త సినిమా యానిమల్’ ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ‏తో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో రణబీర్ తో పాటు సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా నటిస్తున్నాడు.

కాగా గ్యాంగ్‌ స్టర్ డ్రామా నేపథ్యంలో రానున్న ఈ సినిమా 2023 ఆగస్టు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది. మనిషి జంతువులా మారితే ? ఈ కోణంలో ఈ ‘యానిమల్‌’ సాగనుంది. ఈ సినిమాలో పరిణీతి చోప్రా కథానాయికగా నటించబోతుంది. సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, భద్రకాళీ పిక్చర్స్‌, సినీ స్టూడియోస్‌ వన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు