యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ తన కొత్త సినిమా ‘యానిమల్’ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు. కాగా ఈ సీక్వెన్స్ లో రణబీర్ తో పాటు సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా పాల్గొన్నాడట.
ఇక గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో రానున్న ఈ సినిమా 2023 ఆగస్టు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది. మనిషి జంతువులా మారితే ? ఈ కోణంలో ఈ ‘యానిమల్’ సాగనుంది. ఈ సినిమాలో పరిణీతి చోప్రా కథానాయికగా నటించబోతుంది. సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్ భూషణ్ కుమార్, భద్రకాళీ పిక్చర్స్, సినీ స్టూడియోస్ వన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
అన్నట్టు ‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేసి.. అదే బోల్డ్ సినిమాని హిందీలో కూడా చేసి.. రెండు ప్రధాన భాషల్లో తనకంటూ సొంత మార్కెట్ తెచ్చుకున్నాడు సందీప్ వంగ.