రాణి ముఖర్జీకి కీలక పాత్ర ఇస్తున్న త్రివిక్రమ్?

రాణి ముఖర్జీకి కీలక పాత్ర ఇస్తున్న త్రివిక్రమ్?

Published on Dec 19, 2022 6:30 PM IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ భామ రాణి ముఖర్జీను తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారట. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్రకి రాణి ముఖర్జీ అయితేనే సరైన న్యాయం జరుగుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. మరి రాణి ముఖర్జీ ఒప్పుకుంటే.. ఈ సినిమా పై బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి.

మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు