రష్మిక బాలీవుడ్ బిగ్గీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి సిద్దం?

రష్మిక బాలీవుడ్ బిగ్గీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి సిద్దం?

Published on Nov 17, 2022 12:22 AM IST


రష్మిక మందన్న హిందీలో మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం, మిషన్ మజ్ను మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ OTT రిలీజ్ ను ఎంచుకున్నారు. ఈ చిత్రం జనవరి 18, 2023న ప్రసారం కానుంది.

మిషన్ మజ్ను చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మిషన్ మజ్ను భారతదేశం యొక్క రహస్య గూఢచార సంస్థ RAW యొక్క అతిపెద్ద రహస్య కార్యకలాపాలను పాకిస్తాన్‌లో ప్రదర్శిస్తుంది. యాడ్ ఫిల్మ్ మేకర్ శంతను బాగ్చి దర్శకుడు కాగా, బాలీవుడ్ అగ్ర నిర్మాత రోనీ స్క్రూవాలా అమర్ బుటాలా మరియు గరిమా మెహతాతో కలిసి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు