లేటెస్ట్ : ప్రత్యేక రోజుని తల్చుకుని ఎగ్జైట్ అయిన రష్మిక

లేటెస్ట్ : ప్రత్యేక రోజుని తల్చుకుని ఎగ్జైట్ అయిన రష్మిక

Published on Dec 18, 2022 1:09 AM IST


టాలీవుడ్ స్టార్ కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు సినిమాలతో కెరీర్ పరంగా బిజీ బిజీగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైం నాగశౌర్య హీరోగా రూపొందిన ఛలో మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అనంతరం విజయ్ దేవరకొండ తో గీత గోవిందం, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ, అలానే గత ఏడాది డిసెంబర్ లో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ వంటి మూవీస్ తో కెరీర్ లో పలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సొంతం చేసుకుని ఆడియన్స్ లో బాగా క్రేజ్ అందుకున్నారు.

ఇక సరిగ్గా గత ఏడాది ఇదే రోజున పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ రిలీజ్ అవడంతో ఆ సినిమా గురించి ఎగ్జైట్ అవుతూ ఇన్స్టాగ్రమ్ లో ఆమె నేడు కొద్దిసేపటి క్రితం ఒక పోస్ట్ పెట్టారు. సరిగ్గా ఇదే రోజున పుష్ప రిలీజ్ అయింది అంటే నాకు నమ్మశక్యంగా లేదు, చూడబోతే నిన్ననే సినిమా కోసం మేము వర్క్ చేసినట్లుంది, ఇక తాను పుష్ప ది రూల్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వంటి అద్భుతమైన టీమ్ తో వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ రష్మిక పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు