క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ‘గుడ్ బై’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా రష్మిక ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ మూవీకి సంబంధించి ఎంతో ఎమోషనల్ అవుతూ రష్మిక ఒక పోస్ట్ కూడా పెట్టింది. ‘గుడ్ బై. నా బిడ్డ ‘గుడ్ బై’కు ఇది చెప్పాలని లేదు. కానీ.. చెప్పాల్సిన టైం వచ్చింది. ఈ సినిమా జర్నీ ప్రారంభమై రెండేళ్లు గడిచాయి. ఎన్ని సమస్యలు ఉన్నా పార్టీ చేసుకోకుండా ఏదీ ఆపలేదు.
గుడ్ బై ఎలాంటి మ్యాజిక్స్ చేస్తుందో చూడాలని ఆతృతగా ఉన్నాను. అమితాబ్ బచ్చన్ సార్.. మీరంటే నాకు చాలా అభిమానం. మీతో ఈ సినిమా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు అత్యుత్తమ వ్యక్తి!. అంటూ రష్మిక ఎంతో ఎమోషనల్ గా రాసుకొచ్చింది. అన్నట్లు రష్మిక .. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమాలో కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
https://www.instagram.com/p/CfMRlViqO5S/