ప్రస్తుతం మాస్ మహారాజ్ హీరోగా నటిస్తున్న సినిమా “క్రాక్”. తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ప్లాన్ చేస్తున్న ఈ పవర్ ప్యాకెడ్ కాప్ డ్రామాపై చాలానే అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వచ్చిన “డిస్కో రాజా” చిత్రం అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ సినిమాపై మాత్రం మంచి అంచనాలు నెలకొన్నాయి.
అలాగే ఈ మధ్యనే ఫైనల్ షెడ్యూల్ ను కూడా స్టార్ట్ చేసి దాన్ని కూడా శరవేగంగా పూర్తి చేసేసే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మాస్ మహారాజ్ ఇప్పుడు గోవా పయనమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా రవితేజనే తెలిపారు. కోవిడ్ నిబంధనలు అన్ని తీసుకొని ఈ షూట్ లో పాల్గొననున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా శృతి హాసన్ మరోసారి రవితేజతో ఈ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకొంది. ఇక అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలపాలని ట్రై చేస్తున్నారు. మరి ఈ చిత్రం అప్పుడు నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.
Off to Goa for the final schedule of #krack #maskon pic.twitter.com/cYtvTScTST
— Ravi Teja (@RaviTeja_offl) December 3, 2020