రెజీనా, నివేతా లేటెస్ట్ మూవీ ‘శాకినీ డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్ ….!.

రెజీనా, నివేతా లేటెస్ట్ మూవీ ‘శాకినీ డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్ ….!.

Published on Aug 16, 2022 5:09 PM IST

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ రెజీనా కసాండ్రా, నివేతా థామస్ తొలిసారిగా కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ శాకినీ ఢాకినీ. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీని డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. యువ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఆసక్తికరమైన కథ, కథనాలతో తమ సినిమా రూపొందిందని అంటోంది యూనిట్. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ తరువాత అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన శాకినీ ఢాకినీ మూవీని సెప్టెంబర్ 16, 2022న విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కోసం హీరోయిన్స్ ఇద్దరూ కూడా ఎంతో కష్టపడంతో పాటు వారిద్దరి పాత్రలు ఆడియన్స్ ని అలరిస్తాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు