టాలెంటెడ్ హీరోయిన్ అని.. క్యారెక్టర్ కోసం ఎటువంటి కసరత్తులైన చేస్తోందని.. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ రెజీనాకి మంచి పేరే ఉంది. కానీ సరైన హాట్ లేకపోవడంతో.. క్రేజీ హీరోయిన్ గా మారలేకపోతుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. అయితే తాజాగా రెజీనా నటిస్తోన్న ‘ఎవరు’ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కానుంది. వెంకట్ రామ్జీ దర్శకత్వంలో అడివిశేష్ హీరోగా రూపొందుతోన్న ఈ థ్రిల్లర్ మూవీ రెజీనా పాత్ర చుట్టే తిరుగుతుందట. ముఖ్యంగా రెజీనా క్యారెక్టర్ సినిమాలోనే హైలెట్ అవబోతుందని.. సస్పెన్స్ రేకెత్తించే విధంగా సీరియస్ గా సాగే టోన్ లో రెజీనా రోల్ ఉంటుందట.
ఇక ఈ సినిమా ప్రధానంగా ఓ మర్డర్ కేసు గురించి చేసే విచారణ భాగంలో నడుస్తోందని, ఆ విచారణనే సినిమా పై ఆసక్తిని పెంచుతుందని అలాగే రెజీనా – అడవి శేష్ పాత్రల మధ్య సాగే డ్రామా కూడా చాల ఇంట్రస్టింగ్ గా ఉంటుందని చిత్రబృందం చెబుతుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తుండగా.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం కూడా చాల బాగా వచ్చిందట. మెయిన్ నేపధ్య సంగీతం అద్భుతంగా ఉంటుందట.
పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీవీపీ అండ్ అడవి శేష్ కాంబినేషన్ లో గతంలో క్షణం అనే హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.