“వీర సింహా రెడ్డి” మాస్ ఆగమనంకి రిలీజ్ డేట్ వచ్చేసింది.!

“వీర సింహా రెడ్డి” మాస్ ఆగమనంకి రిలీజ్ డేట్ వచ్చేసింది.!

Published on Dec 3, 2022 2:55 PM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వీర సింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ అయితే ఈరోజు ఈ మాసివ్ అనౌన్సమెంట్ ని ఇస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఇక ఈ మాసివ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇపుడు రివీల్ చేసేసారు. ఈ చిత్రంని వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టుగా బాలయ్య పవర్ ఫుల్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేసారు. దీనితో వీరసింహా రెడ్డి మాస్ ఆగమనానికి సమయం ఫిక్స్ అయ్యిపోయింది అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు