జీ 5 లో స్ట్రీమ్ అవుతున్న సాయి తేజ్ ” రిపబ్లిక్”

జీ 5 లో స్ట్రీమ్ అవుతున్న సాయి తేజ్ ” రిపబ్లిక్”

Published on Nov 26, 2021 5:45 PM IST


సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం థియేటర్ల కో విడుదల అయ్యి విమర్శకుల నుండి ప్రశంసల దక్కించుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం జీ 5 లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రం జీ 5 లో ప్రసారం అవుతుండటం తో ప్రేక్షకులు, అభిమానులు చూస్తున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా చిత్రం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయి తేజ్ నటన కి మరియు దేవకట్టా డైలాగ్స్ సూపర్ అంటూ చెప్పుకొచ్చారు. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్ టైన్మెంట్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించడం జరిగింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం లో జగపతి బాబు, రమ్య కృష్ణ, ఐశ్వర్య రాజేష్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు