ఓటీటీలోకి వచ్చేస్తున్న “రౌడీ బాయ్స్”.. తేది ఫిక్స్..!

ఓటీటీలోకి వచ్చేస్తున్న “రౌడీ బాయ్స్”.. తేది ఫిక్స్..!

Published on Mar 1, 2022 1:00 AM IST


ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన చిత్రం “రౌడీ బాయ్స్”. కాలేజ్ బేస్డ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ లు నిర్మించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌లైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, కార్తీక్ రత్నం, కోమలి ప్రసాద్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు