నవంబర్ 19 న థియేటర్ల లోకి “రౌడీ బాయ్స్”

నవంబర్ 19 న థియేటర్ల లోకి “రౌడీ బాయ్స్”

Published on Oct 21, 2021 10:28 PM IST


ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రం ను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. వచ్చే నెల 19 వ తేదీన ఈ చిత్రం ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు ఈ సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు