జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా, ప్రమోషన్స్ని జోరుగా చేస్తుంది చిత్ర బృందం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఏకంగా ఒక్క రోజుకి 50 లక్షలు ఖర్చు చేశారని, అయితే ఇప్పుడు సినిమాలో ఆ సన్నివేశమే లేదని బజ్ నడుస్తోంది. దానికి కారణం సినిమా నిడివి ఎక్కువగా ఉండడమేనని అందుకే రాజమౌళి సినిమాలోని ఒక నిమిషం 36 సెకన్ల నిడివి గల ఎన్టీఆర్ కీలక సన్నివేశాన్ని కత్తిరించారట. అయితే విడుదల తర్వాత సినిమాకి మంచి స్పందన వస్తే అప్పుడు ఈ సీన్ ను యాడ్ చేస్తారని టాక్ నడుస్తుంది.