లేటెస్ట్ పిక్ : కీరవాణిని కలిసి అభినందించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రొడ్యూసర్

లేటెస్ట్ పిక్ : కీరవాణిని కలిసి అభినందించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రొడ్యూసర్

Published on Jan 28, 2023 12:00 AM IST


దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ గత ఏడాది మార్చి చివర్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఎంతో పెద్ద భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటించిన ఈ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ రిలీజ్ తరువాత రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్ ని సొంతం చేసుకోవడంతో పాటు పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులని సైతం కొల్లగొడుతూ దూసుకెళుతోంది. ఇక ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ స్థానం సంపాదించింది.

దానితో యావత్ ఇండియా మొత్తం ఉన్న సినీ అభిమానులు, ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రసంశలు కురిపించారు. ముఖ్యంగా అంతటి అద్భుతమైన సాంగ్ ని కంపోజ్ చేసిన కీరవాణి పై మరింతగా ప్రసంశలు కురుస్తున్నాయి. అలానే రెండు రోజుల క్రితం భారత ప్రభుత్వం కీరవాణికి పద్మశ్రీ అవార్డుని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే, ఆర్ఆర్ఆర్ మూవీ ప్రొడ్యూసర్, డివివి ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయిన దానయ్య నేడు కీరవాణిని ప్రత్యేకంగా కలిసి తమ మూవీ సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవడం, అలానే ఆయనకు పద్మశ్రీ అవార్డు దక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తూ అభినందించారు. కీరవాణి గారు రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లు సొంతం చేసుకోవాలని, అలానే ఆ భగవంతుడు ఆయనకు పూర్ణాయుష్షుని అనుగ్రహించాలని కోరుతూ నిర్మాత దానయ్య మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా కీరవాణిని దానయ్య కలిసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు