“రుద్ర తాండవం” తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్న కాశ్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్

“రుద్ర తాండవం” తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్న కాశ్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్

Published on Oct 31, 2021 3:02 PM IST

రిషి రిచర్డ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో, దర్శ గుప్త, రాధ రవి, తంబి రామయ్య కీలక పాత్రల్లో జి.ఎమ్. ఫిల్మ్ కార్పొరేషన్, 7జి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన తమిళ చిత్రం రుద్రతాండవం. మోహన్. జి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల కోలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్ర తెలుగు హక్కులను కాశ్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ నిర్మాతలు కె. కిరణ్, విజయ్ లు మంచి రేటుకు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో టాలీవుడ్‌ లోని ఓ ప్రముఖ హీరోతో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

అక్టోబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం కి జుబిన్ సంగీతం అందించారు. ఫరూక్ జే. బాషా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించడం జరిగింది. దేవరాజ్ ఎస్ ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరించారు. తెలుగు రైట్స్ సొంతం చేసుకోవడం తో ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు