BRO సెట్స్‌ లో చేరిన సాయి ధరమ్ తేజ్!

BRO సెట్స్‌ లో చేరిన సాయి ధరమ్ తేజ్!

Published on May 22, 2023 3:01 PM IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తాజా సమాచారం ఏమిటంటే సాయి ధరమ్ తేజ్ BRO సెట్స్‌ లోకి తిరిగి వచ్చాడు. ఈ బిగ్గీలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. దర్శకుడు సముద్రకని BRO యొక్క వర్కింగ్ స్టిల్‌ను ప్రేక్షకులతో పంచుకున్నారు మరియు కిక్ స్టార్టింగ్ విత్ మై BRO అని రాశారు.

పవన్ కళ్యాణ్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్నాడని కూడా తెలుస్తోంది. ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, సుబ్బరాజు, రోహిణి మొల్లేటి, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూలై 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు