సాయి పల్లవి – రానా సినిమాపై క్లారిటీ వచ్చింది !

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా , సాయి పల్లవి జంటగా ఓ చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. అయితే ఇటీవల ఈచిత్రం ఆర్ధిక సమస్యల వల్ల ఆగిపోయిదని వార్తలు వచ్చాయి . ఇక తాజాగా ఈ సినిమా ఫై రానా స్పందించాడు. సాయి పల్లవి తో నటించనున్నాని ఆయన క్లారిటీ ఇచ్చారు. జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రంలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటించనుండగా రానా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్.

1990 లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘విరాట పర్వం 1992’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

Exit mobile version