రీషూట్ కోసం కండీషన్ పెట్టిన సాయి పల్లవి !

శర్వానంద్ ,సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడిపడి లేచె మనసు’. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మళ్ళీ రీషూట్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈచిత్రంలోని కొన్ని సీన్లను రీ షూట్ చేస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ఇక ఈ షూటింగ్ లో పాల్గొనడానికి సాయి పల్లవి కండీషన్ పెట్టిందట. తను ఇచ్చిన డేట్స్ కంటే ఎక్కువ రోజులు ఈచిత్రానికి పనిచేయాల్సి రావడంతో ఈరీషూట్ లో పాల్గొనాల్సిన రోజులకు కూడా పారితోషికం ఇవ్వాలని అడిగిందట. చిత్ర నిర్మాతలు కూడా అందుకు ఓకే అన్నట్లు సమాచారం.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. చెరుకూరి సుధాకర్, చుక్కపల్లి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం డిసెంబర్21న ప్రేక్షకులముందుకు రానుంది.

Exit mobile version