“విరాట పర్వం” పై సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

“విరాట పర్వం” పై సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Jul 1, 2022 12:00 PM IST


రీసెంట్ గా మన టాలీవుడ్ దగ్గర రిలీజ్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరియు నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “విరాట పర్వం” కూడా ఒకటి. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఈ సినిమా యూనిట్ అందరికి కూడా ఒక ప్రత్యేక ప్రయాణంగా నిలిచింది.

అయితే ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రిలీజ్ కాగా ఈ సినిమా హీరోయిన్ సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. విరాట పర్వం లో తాను చేసిన వెన్నెల పాత్ర నేను ఇప్పుడు వరకు చేసిన పాత్రల్లో ఒక మరపురాని పాత్ర అని ఆ రోల్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నానని తాను తెలిపి విరాట పర్వం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది అందరూ చూడాలని కోరింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు