‘శాకుంతలం’ ఆడియెన్స్‌ కి గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది – దిల్ రాజు

‘శాకుంతలం’ ఆడియెన్స్‌ కి గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది – దిల్ రాజు

Published on Mar 28, 2023 9:52 PM IST


సమంత హీరోయిన్ గా దేవ్ మోహన్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా మూవీ శాకుంతలం. దిల్ రాజు సమర్పణలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా నిర్మితం అయిన ఈ పాన్ ఇండియన్ మూవీ ఏప్రిల్ 14న పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మరోవైపు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నిటికీ కూడా సమంత ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక నేడు ఈ మూవీ యొక్క 3డి ట్రైలర్ ని గ్రాండ్ గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనిట్ మూవీ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ముందుగా నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ సమంతగారు ఈ 3డి ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌కి రావాల్సింది కానీ కొన్ని కారణాల వలన రాలేక‌పోయారు. నిజానికి ఆమె మ‌న‌సంతా ఇక్క‌డే ఉంది. శాకుంత‌లం సినిమాను 3డి టెక్నాల‌జీలోకి మార్చాల‌నే ఆలోచన దిల్‌రాజు గారిదే. అందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. ఇప్పుడు త్రీడీ ట్రైల‌ర్ చూస్తుంటే ఆయ‌న ఆలోచ‌న ఎంత గొప్ప‌దో అర్థ‌మ‌వుతుంది. మ‌న మైథాల‌జీని ఇలా త్రీడీలో సినిమా చేయ‌టం ఇదే తొలిసారి అనుకుంటా. మ‌న సంస్కృతిని సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం. 3డిలో శాకుంతలం సినిమాను ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నాను. ఏప్రిల్ 14న సినిమా అందరి మెప్పు సొంతం చేసుకుంటుందని భావిస్తున్నాను అన్నారు.

రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ శాకుంతలం వంటి గొప్ప సినిమాకు ప‌ని చేసే అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ క‌థేంటో మ‌న అంద‌రికీ తెలిసిందే. అయితే గుణశేఖర్ గారు చెప్పిన క‌థ విన్న త‌ర్వాత‌ ఆయ‌న టేకాఫ్‌కి థ్రిల్ అయిపోయాను. అంద‌రూ ఊహించిన దాని కంటే విభిన్నంగా ప్ర‌తీ నిమిషం సినిమా బావుంటుంది. ఈ సినిమా న‌వ్విస్తుంది. ఏడిపిస్తుంది. న‌వ్విస్తూ ఏడిస్తుంది అలానే ఆలోచింప చేస్తుంది. ఒక అద్భుత‌మైన సినిమా చూశామ‌నే ఫీలింగ్‌ను మీకు ఇచ్చి థియేట‌ర్స్ నుంచి బ‌య‌ట‌కు తీసుకొస్తుంది. శ‌కుంత‌ల పాత్ర‌లో స‌మంత, దేవ్ మోహ‌న్ ఇద్దరూ కూడా చాలా గొప్ప‌గా న‌టించారు. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ప్ర‌తీ డిపార్ట్‌మెంట్ నుంచి గుణ శేఖ‌ర్‌గారు మంచి ఔట్‌పుట్ తీసుకున్నారు. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన గుణ శేఖ‌ర్‌గారికి, దిల్ రాజుగారికి థాంక్స్‌ అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ నిజానికి గుణ శేఖ‌ర్‌గారు స‌మంత‌తో ఈ ప్రాజెక్ట్ అనుకున్న‌ప్పుడు నేను లేను. అయితే స‌మంత మేనేజర్ మ‌హేంద్ వ‌చ్చి ఇలా సినిమా అనుకుంటున్నారు సార్‌, మీరు క‌థ వింటే బావుంటుందన్నారు. స‌రేన‌ని క‌థ విన్నాను. అంద‌రూ నేను గుణ శేఖ‌ర్‌గారికి హెల్ప్ చేయ‌టానికి ఈ సినిమాలో జాయిన్ అయ్యాన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ నేను సెల్ఫిష్‌గా ఈ సినిమాలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్‌కు చేరుకుంది. అలాంటి గ్లోబ‌ల్ సినిమా గురించి నేర్చుకోవ‌టానికే నేను శాకుంత‌లంలో జాయిన్ అయ్యాను. వి.ఎఫ్‌.ఎక్స్ గురించి నేర్చుకోవాల‌నే ఉద్దేశంతోనే నేను ఇందులో పార్ట్ అయ్యాను. సాధార‌ణంగా ఇలాంటి సినిమాల్లో నిర్మాత‌ల‌కు పెద్ద‌గా ప‌ని ఉండ‌దు. కానీ నేను మాత్రం గుణ శేఖ‌ర్‌గారికి హెల్ప్ కావాలి. నేను కూడా నేర్చుకోవాల‌ని జాయిన్ అయ్యాను. బాహుబ‌లితో తెలుగు సినిమాను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌తో దాన్ని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లాడు. అలాగే తెలుగు సినిమాల‌ను ఇంకా ప్ర‌పంచానికి చూపిస్తూ ఉండాల‌నే ఉద్దేశంతో నేను వేసిన మొద‌టి అడుగు శాకుంత‌లం.బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామా విజువ‌ల్ వండ‌ర్‌గా సినిమా తెరెక్కింది. సినిమా చూసి బ‌య‌ట‌కొచ్చేట‌ప్పుడు అల్లు అర్హ రూపంలో ఓ స‌ర్‌ప్రైజ్ ఉంటుంది. నాకు సినిమా గురించి ఇంకా నేర్పించినందుకు గుణ శేఖ‌ర్‌గారికి థాంక్స్‌. ఈ మూవీ వ్య‌వ‌థి 2 గంట‌ల 19 నిమిషాలు. తప్పకుండా ఆడియన్స్ ని ఈ మూవీ ఆకట్టుకుంటుందనే నమ్మకం దిల్ రాజు వ్యక్తం చేసారు.

ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ మాట్లాడుతూ ఇది స‌మంత‌గారి శాకుంత‌లం. ఆమె ప్రాణం పెట్టి శకుంత‌ల పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. ఏప్రిల్ 14న మీరు సినిమా చూసి ఏం మాట్లాడాల‌నుకుంటున్నారో వినాల‌ని ఎదురు చూస్తున్నారు. మ‌హాభారతంలో దుష్యంతుడు, శ‌కుంత‌ల పాత్ర‌లను ఆధారంగా చేసుకుని కాళిదాసుగారు అభిజ్ఞాన శాకుంత‌లం రాశారు. దాన్ని విజువ‌ల్‌గా మీ ముందుకు తీసుకొచ్చే క్ర‌మంలో లింకుల కోసం చిన్న చిన్న ఇంప్ర‌వైజేష‌న్ చేశాం త‌ప్ప‌ దాదాపు 90 శాతం ఒరిజిన‌ల్ క‌థ‌నే సినిమాగా తీశాం. నిర్మాత దిల్‌రాజు గారు నిత్య విద్యార్థి. ప్ర‌తి రోజూ ఆయ‌న కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటుంటారు. తెలుగు సినిమా ఈరోజు ఇలాగా వెలిగిపోతుందంటే ఆయన లాంటి నిర్మాత‌లే కారణం. స‌మంత‌గారితో ఈ సినిమా చేయాల‌న‌కున్న‌ప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో పార్ట్ కావ‌టానికి చాలా మంది నిర్మాత‌లు ఆస‌క్తి చూపించారు. అయితే దిల్ రాజుగారు పార్ట్ అవుతార‌న‌గానే నేను ఆస‌క్తి చూపించాను. అందుకు కార‌ణం మేక‌ర్‌గా ఓ సినిమాను చూసి ఆయ‌న చెప్పేయ‌గ‌ల‌రు. ఆయ‌న‌లాంటి మేక‌ర్‌ను వాడుకోక‌పోతే మా మూర్ఖ‌త్వ‌మే అవుతుంది ఇది. ఆయ‌న ఎగ్జిబిట‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత‌. ఆడియెన్స్ ప‌ల్స్ తెలిసిన నిర్మాత‌. ఆయ‌న్ని వాడుకోవాల్సిన అవ‌స‌రం మాకు ఉంది అన్నారు. మీ అందరూ ఆశిస్తున్నా విధంగా తప్పకుండా మూవీ మిమ్మల్ని అలరిస్తుందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు