సమంత వాళ్ళని స్వంత పిల్లలు లాగా చూసుకుంటుదట !

తెలుగు సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌ అయిన సరే, ఆమెకు పెళ్లి అయితే ఇక ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకుంటారు. కానీ అక్కినేని సమంతకి ఈ నియమం వర్తించదు. ఎందుకంటే పెళ్లి తరువాత కూడా ఆమె వరుసగా సినిమాలు చేస్తూ భారీ విజయాలు అందుకుంటున్నారు. కాగా తాజాగా సమంత ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూ టర్న్‌ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.

అయితే సమంత తాజాగా ఓ టీవీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆ టీవీ షో హోస్ట్ ‘మీ పిల్లలు బాగున్నారా..?’ అని అడిగిన వెంటనే.. సమంత నవ్వుతూ ‘అందరూ బాగున్నారు. నా హెయిర్ డ్రస్సర్, మేకప్ మ్యాన్, నా కుక్, నా అసిస్టెంట్ అంతా బాగున్నారు’ అని సమాధానం ఇచ్చింది. సమంత వాళ్ళని స్వంత మనుషుల్లానే చూసుకుంటుందట. ఎప్పుడైనా ఆమె వారి పై కోప్పడినా.. ‘మా అమ్మే కదా కోప్పడింది’ అని వాళ్లు అస్సలు ఫీల్ అవ్వరట. అందుకే ఆ హోస్ట్ మీ పిల్లలు బాగున్నారా అని అడిగాడు.

ప్రస్తుతం, ‘నిన్ను కోరి’ చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య సరసన ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా ఈ చిత్రం తెరకెక్కబోతుందట. ఏమైనా తమ పెళ్లి తర్వాత సమంత, నాగ చైతన్య కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

Exit mobile version