సమంత ‘యశోద’ లేటెస్ట్ కలెక్షన్స్.. రూ.33 కోట్ల గ్రాస్ !

సమంత ‘యశోద’ లేటెస్ట్ కలెక్షన్స్.. రూ.33 కోట్ల గ్రాస్ !

Published on Nov 21, 2022 5:34 PM IST

సమంత ప్రధాన పాత్రలో వచ్చిన యశోద చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా క్రమంగా స్లో అవుతుంది. కాగా, తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ లాభాలను అందుకుంది. సరోగసీ కి సంబంధించిన సున్నితమైన అంశం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ విలన్ గా నటించింది. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. మొత్తానికి సమంత యశోదతో చాలా మంది హృదయాలను గెలుచుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు