యశోద మంచి హిట్ సాధించి సమంత తన స్టార్డమ్ని మరోసారి నిరూపించుకుంది. ఫిమేల్ ఓరియెంటెడ్ గా రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల రూపాయల కి పైగా వసూలు చేసింది. చాలా మంది సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు యశోద సక్సెస్ తో ఫ్యాన్స్ అంతా కూడా, అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన సమంత తదుపరి చిత్రం శాకుంతలం వైపు మళ్లింది.
సమంత మరో ఫీమేల్ సెంట్రిక్ రోల్లో కనిపించనుండడంతో అభిమానుల కోసం గుణ శేఖర్ ఏమి ఉంచాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ మోడ్లో ఉన్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో ఆమె యువరాణిగా నటించింది. గుణశేఖర్ ఇప్పుడు ప్రేక్షకులకు మంచి సినిమాను అందించాలని ఒత్తిడిలో ఉన్నాడు. ఈ చిత్రం కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.