విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎందుకంత స్పెషల్ అనేది మరోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో రుజువైంది. ఈ సినిమాకు వరల్డ్వైడ్గా వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ మూవీ ఎలాంటి సెన్సేషనల్ రన్ను సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక ఓవర్సీస్లోనూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ కలెక్షన్స్ సంఖ్య మరింతగా పెరగడం ఖాయమని చిత్ర యూనిట్ ఆశిస్తుంది.
ఇక ఈ సినిమాలో వెంకీ పర్ఫార్మెన్స్తో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చైదరి కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. భీమ్స్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ అసెట్గా నిలిచింది.