“సర్కారు వారి పాట” సక్సెస్ మీట్ వేదిక మార్పు.!

“సర్కారు వారి పాట” సక్సెస్ మీట్ వేదిక మార్పు.!

Published on May 15, 2022 12:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గా విడుదల అయ్యి భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో మేకర్స్ ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ వేడుకలని విజయవాడలో చేస్తున్నట్టుగా నిన్న అనౌన్స్ చేశారు.

అయితే ఇప్పుడు మళ్ళీ ఈ వేడుకల వేదికని మార్చినట్టుగా మేకర్స్ తెలిపారు. కర్నూల్ ఎస్ టి బి సి కాలేజ్ గ్రౌండ్స్ లో అదే మే 16న సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. దీనితో అభిమానులు అయితే ఇది గమనించాలి. ఇక ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు,

సంబంధిత సమాచారం

తాజా వార్తలు