ఓవర్సీస్ లో ఆదరగొడుతున్న “సర్కారు వారి పాట”.!

ఓవర్సీస్ లో ఆదరగొడుతున్న “సర్కారు వారి పాట”.!

Published on May 14, 2022 7:09 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల కాంబినేషన్లో ఫస్ట్ టైం తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ మాస్ అండ్ సోషల్ డ్రామా “సర్కారు వారి పాట”. భారీ అంచనాలతో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా అదరగొట్టింది.

ప్రీమియర్స్ మరియు మొదటి రోజు వసూళ్ల తోనే 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసిన ఈ చిత్రం ఇప్పుడు ఈ రెండు రోజుల్లో 1.4 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని క్రాస్ చేసినట్టు కన్ఫర్మ్ దీనితో అనుకున్నట్టు గానే ఈ సినిమా సాలిడ్ రన్ ని అక్కడ కొనసాగిస్తోంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా సముద్రకని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు