సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఈ మూడు రోజుల్లో అదిరే వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా అందుకుంది. మరి మహేష్ కి సూపర్ స్ట్రాంగ్ ఏరియా అయినటువంటి ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రం అదరగొడుతుంది అని చెప్పాలి.
లేటెస్ట్ గా ఈ చిత్రం అక్కడ 1.8 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి ఈరోజు కలెక్షన్ తో సెన్సేషనల్ మార్క్ 2 మిలియన్ కి చేరుకోనుంది. మొత్తానికి అయితే ఈ చిత్రం యూఎస్ ఓ దుమ్ము లేపుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
Phenomenal❤️????
The Superstar streak continues..!✨#BlockBusterSVP #SarkaruVaariPaata Crossed $????.???????????????????????????????? Gross mark in the USA????????@urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @GMBents @MythriOfficial @14ReelsPlus @FlyHighCinemas @ShlokaEnts #SVPUsaSandhadi #SVP pic.twitter.com/f1Mlp2TZbb
— FlyHigh Cinemas (@FlyHighCinemas) May 15, 2022