యూస్ఎలో రికార్డ్ లొకేషన్లలో “సర్కారు వారి పాట” రిలీజ్..!

యూస్ఎలో రికార్డ్ లొకేషన్లలో “సర్కారు వారి పాట” రిలీజ్..!

Published on May 4, 2022 3:00 AM IST


సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించాడు.

అయితే తాజాగా ఈ సినిమా యూఎస్‌లో 603 ప్లస్ లొకేషన్లలో రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు పలు రికార్డులను బ్రేక్ చేయగా మొన్న విడుదలైన ట్రైలర్ కూడా సంచలనం సృష్టిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు