డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన సత్యదేవ్ “గాడ్సే”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన సత్యదేవ్ “గాడ్సే”

Published on Jul 13, 2022 6:30 PM IST


యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ సత్య దేవ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. ఆయన తదుపరి కృష్ణమ్మ మరియు చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో కనిపించనున్నారు. అతని ఇటీవల విడుదలైన గాడ్సే చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి సిద్దమైంది.

గాడ్సే జూలై 17 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గోపీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది, ఇది ఆమె తెలుగు అరంగేట్రం. నాగబాబు కొణిదెల, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, నోయల్ సీన్, ప్రియదర్శి, నాజర్, సిజ్జు మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సికె స్క్రీన్స్ బ్యానర్‌పై సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్, శాండీ అద్దంకి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు