బాలయ్య “వీరసింహా రెడ్డి” నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

బాలయ్య “వీరసింహా రెడ్డి” నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

Published on Dec 11, 2022 4:37 PM IST

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన వీరసింహా రెడ్డి చిత్రం జనవరి 12, 2023న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. దానికి ముందు మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈరోజు సెకండ్ సింగిల్ విడుదలకు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. సుగుణ సుందరి పేరుతో, ప్రధాన జంటపై టర్కీలో చిత్రీకరించిన ఈ సాంగ్ డిసెంబర్ 15, 2022న విడుదల కానుంది.

అదే విషయాన్ని తెలియజేసేందుకు బాలయ్య మరియు శృతి ఉన్న రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించిన ఈ బిగ్గీలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు