విషాదం : ప్రముఖ దర్శకుడు మృతి

విషాదం : ప్రముఖ దర్శకుడు మృతి

Published on Feb 25, 2024 3:43 PM IST

హిందీ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్ డైరెక్టర్ కుమార్ షహానీ (83) కన్నుమూశారు. కోల్‌కతాలోని తన నివాసంలో ఆయన జారి పడిపోవడంతో మరణించినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్న మాయా దర్పణ్, తరంగ్, ఖయాల్ గత, కస్బా వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించి మెప్పించారు. అలాగే, కుమార్ షహానీ పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించి సక్సెస్ అయ్యారు.

కుమార్ షహానీ విలక్షణ దర్శకుడే కాదు, మంచి మనిషి కూడా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అని అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున కుమార్ షహానీ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు