ఎస్ జే సూర్య లేటెస్ట్ థ్రిల్లర్ సిరీస్ కి సీక్వెల్.?

ఎస్ జే సూర్య లేటెస్ట్ థ్రిల్లర్ సిరీస్ కి సీక్వెల్.?

Published on Dec 17, 2022 1:00 AM IST


లేటెస్ట్ గా ఓటిటిలో రిలీజ్ అయ్యిన సినిమాలు సహా వెబ్ సిరీస్ లో అయితే మంచి రెస్పాన్స్ అందుకున్న సిరీస్ “వదంతి” కూడా ఒకటి. వెర్సటైల్ నటుడు ఎస్ జే సూర్య మెయిన్ లీడ్ లో దర్శకుడు ఆండ్రూ లూయిస్ తెరకెక్కించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలు అలాగే ఆడియెన్స్ ని అమితంగా అలరించగా దీనిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ తమిళ్ సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది.

మేకర్స్ అయితే ఇప్పుడు సీక్వెల్ ని అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ఎప్పుడు రానుందో చూడాలి. ఇక సిరీస్ లో లైలా నాజర్ తదితరులు నటించగా సైమన్ కె కింగ్ సంగీతం అందించారు. అలాగే ఈ సిరీస్ ని అయితే ప్రముఖ బాలీవుడ్ దర్శక డ్యూయో పుష్కర్ మరియు గాయత్రీ లు నిర్మాణం వహించారు. మరి ఈ నెక్స్ట్ సీజన్ ని అయితే మేకర్స్ ఎలా కంటిన్యూ చేస్తారో అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు