ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “షంషేరా” చిత్రం..!

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “షంషేరా” చిత్రం..!

Published on Aug 19, 2022 12:33 PM IST

రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో భారీ బడ్జెట్ తో వచ్చిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ అండ్ టాలెంటెడ్ హీరో రణబీరా కపూర్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా “షంషేరా” కూడా ఒకటి. బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్నా కూడా బాలీవుడ్ కి కావాల్సిన హిట్ రేంజ్ వసూళ్లు అయితే రాబట్టలేకపోయింది. దీనితో ఈ చిత్రం కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. మరి ఫైనల్ గా అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని అమేజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ చిత్రం హిందీ, తెలుగు సహా తమిళ భాషల్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు