‘చరణ్’ ప్రమోషన్స్ కారణంగా షూటింగ్ పోస్ట్ ఫోన్ !

‘చరణ్’ ప్రమోషన్స్ కారణంగా షూటింగ్ పోస్ట్ ఫోన్ !

Published on Dec 20, 2021 6:26 PM IST

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయింది. అయితే, ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. జనవరి మూడో వారం వరకు చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కే తన టైం కేటాయించాడు. ఇక ఆ తర్వాత నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు ఆచార్య ప్రమోషన్స్ లో భాగం కానున్నాడు.

దాంతో వరుసగా రెండు నెలల పాటు ప్రమోషన్స్ లో చరణ్ బిజీగా ఉండాల్సి రావడంతో ఇక తప్పక శంకర్ తన సినిమా షూటింగ్ ను ఫిబ్రవరికి పోస్ట్ ఫోన్ చేసుకున్నాడు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది.

నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో కూడా చరణ్ ను అలాగే వినూత్నంగా చూపించబోతున్నాడట. అలాగే బాలీవుడ్ నటి ఇషా గుప్తా కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు