ఈ ఏడాది ఆల్రెడీ రెండు సినిమాలు రిలీజ్ చేసిన యువ హీరో శర్వానంద్ నటిస్తున్న మరో లేటెస్ట్ సినిమానే ‘భోగి’. దర్శకుడు సంపత్ నందితో చేస్తున్న ఈ సినిమా మాత్రం ఫుల్ మాస్ యాక్షన్ తో కూడిన మసాలా డ్రామాగా రానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుండగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం మేకర్స్ ఇప్పుడు రాజమండ్రి పయనమయ్యారు.
అక్కడ మొత్తం 10 రోజులు పాటుగా ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేయగా ఈ షెడ్యూల్ లో ఒక హై ఆక్టేన్ మాస్ యాక్షన్ బ్లాక్ ని తెరకెక్కించనున్నారట. దీనిపై ఓ స్పెషల్ వీడియోని కూడా మేకర్స్ వదిలారు. మరి ఈ యాక్షన్ సీన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతిలు నటిస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే శ్రీసత్య సాయి ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Team #Bhogi lands in Rajahmundry for a 10-day HIGH-OCTANE ACTION SCHEDULE ❤️🔥
The intense shoot will take place in the Rampachodavaram forests, where uniquely designed action sequences will be filmed 💥
Charming Star @ImSharwanand
×
Mass Maverick @IamSampathNandi
×
Visionary… pic.twitter.com/xLf0JEHog0— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) April 14, 2026
