యంగ్ అండ్ ప్రామిసింగ్ టాలీవుడ్ యాక్టర్ శర్వానంద్ రాబోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదల తేదీని ఫిక్స్ చేశారు మేకర్స్. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
తాజాగా మేకర్స్ విడుదల తేదీ ఉన్న సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఖుష్భు, ఊర్వశీ, రాధికా శరత్ కుమార్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.