టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అందరికీ తెలిసిందే. మరి పవన్ హీరోగా తన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” షూటింగ్ లో కూడా ఇప్పుడు బిజీ గా ఉన్నారు. మరి నిన్ననే ఈ చిత్రం నుంచి పలు సాలిడ్ అప్డేట్స్ కూడా బయటకి రాగా ఆ వార్తలు మంచి వైరల్ కూడా సాయంత్రం వరకు అయ్యాయి. కానీ తర్వాత రాత్రి నుంచి అయితే పలు వార్తలు షాకింగ్ గా మారాయి.
పవన్ కి ప్రమాదం అంటూ ఓ వార్త నెమ్మదిగా బయటకు రాగా అది తర్వాత పెద్ద ఎత్తున సీరియస్ గా మారింది. ఏకంగా పవన్ ఇంటి దగ్గరకే కొంతమంది ఆగంతకులు చేరి రచ్చ చేసారని పలు వార్తలు సంచలనం గా మారగా దీనితో అయితే పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ నేషనల్ గవర్నమెంట్ అందించాలని వారంతా డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ సీరియస్ అంశంలో ఏమవుతుంది అనేది వేచి చూడాలి.