రైల్వే స్టేషన్ లో చైతన్య , సమంత !

నాగ చైతన్య , సమంత జంటగా ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతుందని తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సింహాచలం రేల్వే స్టేషన్ లో జరుగుతుంది. ఈచిత్రంలో రైల్వే స్టేషన్ లో బుకింగ్ క్లర్క్ గా సమంత నటిస్తుండగా ఆమెకు భర్తగా నాగ చైతన్య నటిస్తున్నారు. సుమంతను చైతు బైక్ ఫై తీసుకురావడం ఆమె టిక్కెట్లు ఇవ్వడం వంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక అక్కడ షూటింగ్ జరుగుతుందని తెలియడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున షూటింగ్ చూడడానికి తరలివచ్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

Exit mobile version