‘వీరసింహా రెడ్డి’ సెట్స్ లో సందడి చేసిన కోలీవుడ్ స్టార్ యాక్టర్

‘వీరసింహా రెడ్డి’ సెట్స్ లో సందడి చేసిన కోలీవుడ్ స్టార్ యాక్టర్

Published on Nov 22, 2022 8:22 PM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీ వీర సింహారెడ్డి. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన వీరసింహా రెడ్డి 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇక ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో జరుగుతుండగా కోలీవుడ్ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ సడన్ గా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి యూనిట్ ని సర్ప్రైజ్ చేసారు. తన చిరకాల మిత్రుడు బాలకృష్ణ నటిస్తున్న వీరసింహా రెడ్డి షూటింగ్ అద్భుతంగా జరుగుతోందని, కొంత గ్యాప్ తరువాత తనని షూటింగ్ లో కలవడం ఎంతో ఆనందంగా ఉందని, తప్పకుండా వీర సింహా రెడ్డి మూవీ అందరి అంచనాలు అందుకుని మంచి సక్సెస్ కావాలని తాను కోరుకుంటున్నట్లు శరత్ కుమార్ ఈ సందర్భంగా యూనిట్ కి ముందస్తు అభినందనలు తెలియచేసినట్లు తెలుస్తోంది. కాగా శరత్ కుమార్, బాలకృష్ణ ని కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు