ఇటీవల పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్లతో మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. ఈ చిత్రం యొక్క విడుదల హక్కులను పుష్యమి ఫిల్మ్ మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి ఫాన్సీ రేటుకు దక్కించుకున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలకు సిద్దమవుతుండడంతో ఈచిత్ర రెండో ట్రైలర్ను ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈరోజు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన మా చిత్ర ట్రైలర్ కిగాని, టీజర్కిగాని ఇంత అద్భుతమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ని మేము అడిగిన వెంటనే త్రివిక్రమ్గారు విడుదల చేయడం చాలా సంతోషం ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు విద్యాసాగర్, జనార్ధన్, బెల్లం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.