ఓటిటి లోకి వచ్చేసిన “సిద్దార్థ్ రాయ్”

దీపక్ సరోజ్ ప్రధాన పాత్రలో, వి. యశస్వి దర్శకత్వం లో తెరకెక్కిన బోల్డ్ రొమాంటిక్ మూవీ సిద్దార్థ్ రాయ్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియో లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. థియేటర్ల లో చూడటం మిస్ అయిన వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

తన్వి నేగి, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గేసి, నందిని, కీర్తన తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించారు. జయ అడపాక నిర్మించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version