ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సిద్దార్థ రాయ్’

బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్న దీపక్ సరోజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సిద్దార్థ రాయ్. ఈ మూవీ ద్వారా వి యశస్వి దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ మరియు విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌ల పై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన ఈ మూవీని నిర్మించారు.

ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ బోల్డ్ కంటెంట్ మూవీ ఆశించిన స్థాయి సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయింది. కాగా ఈ మూవీ మే 3 న ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా అందుబాటులోకి రానుంది. తన్వి నెగి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సిద్దార్ధ రాయ్ పాత్రలో తన నటనతో అందరి నుండి మంచి పేరు అందుకున్నారు దీపక్ సరోజ్. మరి సిద్దార్థ రాయ్ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర మెప్పిస్తాడో చూడాలి.

Exit mobile version