‘గల్లీ రౌడీ’ నుంచి రేపు స్మాల్ గ్లింప్స్ వచ్చేస్తుంది..!

‘గల్లీ రౌడీ’ నుంచి రేపు స్మాల్ గ్లింప్స్ వచ్చేస్తుంది..!

Published on Sep 14, 2021 1:37 AM IST


యంగ్ హీరో సందీప్‌ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా ‘గల్లీ రౌడీ’. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ సమర్పణలో, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 17న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజర్స్‌, పాటలు మరియు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా రేపు ఈ సినిమా నుంచి మరో స్మాల్ గ్లింప్స్ విడుదల కాబోతుంది. “అడ్డంగా బుక్కైపోయా” అంటూ సాగే ఈ పాట రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజేంద్ర ప్ర‌సాద్‌ ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా, కోలివుడ్ యాక్టర్ బాబీ సింహ విలన్‌గా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు