“కేజీయఫ్ 2” కి సాలిడ్ ప్లానింగ్స్ చేస్తున్నారట.!

“కేజీయఫ్ 2” కి సాలిడ్ ప్లానింగ్స్ చేస్తున్నారట.!

Published on Mar 30, 2022 9:00 AM IST


మళ్ళీ ఇండియన్ సినిమా అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది “కేజీయఫ్ చాప్టర్ 2” అనే చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ రాగా..

ఆ హైప్ ని అలా ఉంచేందుకు మేకర్స్ సాలిడ్ ప్లానింగ్స్ చేస్తున్నారట. పాన్ ఇండియా ఆడియెన్స్ కి ఒకేసారి రీచ్ అయ్యే రీతిలో మరిన్ని ఆసక్తికర ప్రమోషన్స్ ని సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఇవెలా ఉంటాయో చూడాలి. మరి ఈ భారీ సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించగా పవర్ ఫుల్ విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించాడు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14 న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు