మరోసారి “సర్కారు వారి పాట” కి సాలిడ్ రెస్పాన్స్.!

మరోసారి “సర్కారు వారి పాట” కి సాలిడ్ రెస్పాన్స్.!

Published on Jun 26, 2022 6:11 PM IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. వీరిద్దరితో పాటుగా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో ఫస్ట్ టైం వచ్చిన సినిమా ఇది. అయితే థియేటర్స్ లో భారీ వసూళ్లనే నే కొల్లగొట్టిన ఈ చిత్రం రీసెంట్ గా అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కూడా వచ్చింది.

మరి ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ నుంచి మాత్రమే కాకుండా ఇతర భాషల సినీ ప్రముఖులు నుంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో మహేష్ మరియు దర్శకుడు పరశురామ్ పెట్ల చూపించిన మెసేజ్ ఎంతో నచ్చింది అని అంటున్నారు. అలాగే మహేష్ సహా నటుడు సముద్రఖని పెర్ఫామెన్స్ లు కూడా బాగున్నాయని ఓటిటి లో చూసాక తమ స్పందనను సోషల్ మీడియాలో పలువురు తెలియజేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు