ట్విట్టర్ లో మరో మైలు రాయిని టచ్ చేసిన “సోనూ సూద్”

ట్విట్టర్ లో మరో మైలు రాయిని టచ్ చేసిన “సోనూ సూద్”

Published on May 2, 2022 5:00 PM IST


ప్రముఖ నటుడు, మానవతా వాది అయిన సోనూ సూద్ సోషల్ మీడియా లో తరచూ యాక్టిివ్ గా ఉంటారు. ప్రస్తుతం ట్విట్టర్ లో సోనూ సూద్ మరో మైలు రాయిని టచ్ చేయడం జరిగింది. 12 మిలియన్ల ఫాలోవర్స్ తో సోనూ సూద్ ట్విట్టర్ లో దూసుకు పోతున్నారు. ఇండియా లో ఈ ఫీట్ సాధించిన అతి కొద్ది మంది లో సోనూ సూద్ ఒకరు.

నటుడు గా సినిమాలు చేస్తూనే, క్లిష్ట పరిస్థితుల్లో, అవసరానికి సహాయం చేస్తూ సోనూ సూద్ ప్రజల గుండెల్లో నిలిచి పోయారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చిత్ర ఆచార్య లో విలన్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు